వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి : శశి థరూర్ సంచలన కామెంట్స్

by Muthe.Rajitha |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి : శశి థరూర్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి భారీ లీడ్ లో ఉందని, కారణాలు వివరంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. ఈ ఓటమిలో మొత్తం కూటమి పనితీరుని పరిశీలించుకొని, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ ఫలితాలు తనను తీవ్రంగా నిరాశ పరిచాయని, తనను ఎన్నికల ప్రచారానికి పిలిచి ఉంటె పరిస్థితి మెరుగ్గా ఉండేదని అన్నారు. ఎన్నికల ప్రకటనకు ముందే NDA కూటమి రాష్ట్రంలోని మహిళలకు కొన్ని ప్రోత్సాహకాలు అందించిందని ఆరోపించారు.

Next Story